Recent Posts

దేశంలో కొత్తగా 7,974 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 7,974 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 343 మంది వైరస్లో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,76,478కి చేరింది. మరోవైపు తాజాగా 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ప్రస్తుతం దేశంలో 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం

పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.

Read More »

దేశంలో ఒమిక్రాన్ కలవరం

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4 ఒమిక్రాన్ కేసులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కంటే 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని హాంగ్కాంగ్ చేసిన ఓ అధ్యయనం తెలిపింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat