ప్రముఖ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిన్న శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బ్యాంకు అయిన కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలో ఉన్న ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …
Read More »ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు
దేశ రాజధాని నగరం ఢిల్లీ నగరంలోని మధుర రోడ్ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు , బాంబు స్వ్కాడ్ పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు …
Read More »దోమలు కుడుతున్నాయని రైలును ఆపించిన బీజేపీ ఎంపీ
యూపీలోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్వీర్ సింగ్ను దోమలు కుట్టడంపై అనుచరుడు మాన్సింగ్ ట్విట్టర్లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్ అధ్వానంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఉన్నావ్ స్టేషన్లో ఆపి బోగీ మొత్తం దగ్గరుండి శుభ్రం చేయించారు. దోమలను వెళ్లగొట్టేందుకు ఫాగింగ్ చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. తమ ఫిర్యాదులపైనా ఇలాగే స్పందించాలని సాధారణ …
Read More »ఢిల్లీకి కొత్త మేయర్ గా షెల్లీ ఒబెరాయ్
ఢిల్లీ మేయర్గా అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ను విత్డ్రా చేసుకోవడంతో.. షెల్లీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆర్థిక సంవత్సరం ముగింపు తర్వాత ఢిల్లీకి కొత్త మేయర్ వచ్చారు. ఢిల్లీలో అయిదేళ్ల పాటు మేయర్ పదవిని రొటేషన్ చేస్తారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మూడు కార్పొరేషన్లను …
Read More »మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు
దేశంలో సార్వత్రిక ఎన్నికలుగానీ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుగానీ వచ్చాయంటే చాలు బీజేపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతారు. కుల, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతారు. ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ఓ మతాన్ని పొగుడుతూ, మరో మతాన్ని కించపరుస్తారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. దాంతో అక్కడి బీజేపీ నేత తాజాగా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. కర్ణాటక బీజేపీ నాయకుడు, …
Read More »స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సానుకూల పవనాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 60,202 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత …
Read More »రూ. 2.3 లక్షల కోట్లకు చేరిన అదానీ అప్పులు
అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …
Read More »కర్ణాటక అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
కర్ణాటక లో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలుపుతూ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన ఆరో జాబితాను విడుదల …
Read More »ఎన్నికల్లో పోటికి ఏకంగా పెళ్ళే చేసుకున్నాడు
యూపీలో రాంపూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో రాంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మామున్ ఖాన్ (45) రాంపూర్ నగర్ వార్డు నుంచి మరోసారి పోటీ చేయాలని భావించాడు. దాదాపు 30 ఏళ్లుగా ఆ వార్డులో అతనే కీలక నాయకుడిగా ఉన్నాడు. కానీ, రాంపూర్ నగర్ వార్డు మహిళకు రిజర్వ్డ్ అయినట్లు నోటిఫికేషన్లో ఉండటంతో మమూన్ ఖాన్ ఖంగుతిన్నాడు.ఎందుకంటే వార్డు మహిళకు …
Read More »