దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల రగడ రాజుకుంటుండగా మరో వైపు ఈ భవనం గుర్తుగా కొత్తగా రూ. 75 కాయిన్ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం సింహ రాజధాని, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.35 గ్రాముల బరువు గల నాణెం …
Read More »ఉత్తరాఖండ్ బోర్డర్ వద్ద గ్రామాలను నిర్మిస్తోన్న చైనా
చైనా, ఇండియా సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఉత్తరాఖండ్ బోర్డర్ వద్ద పొరుగు దేశం చైనా గ్రామాల ను నిర్మిస్తున్నట్లు వెల్లడైంది. ఎల్ఏసీకి 11 కిలోమీటర్ల దూరంలో 250 ఇండ్లు ఉన్న ఓ గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతంలో కూడా చైనా దాదాపు 56 ఇండ్లు నిర్మిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. …
Read More »క్రాస్ అయిన ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్
రూ.2వేల నోట్ల ఉపసంహరణతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజామా..? కాదా అని తెలుసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ను ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దీంతో వెబ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.
Read More »రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం
రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.
Read More »రూ.2వేల నోట్ల రద్ధుతో ఎవరికి లాభం .. ఎవరికి నష్టం..?
గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ …
Read More »లైకా ప్రొడక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగం దాడులు
చెన్నైలోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగం దాడులు నిర్వహిస్తున్నది. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిని ఎనిమిది లొకేషన్లలో ఉదయం నుంచి అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీ నగర్, అడయార్, కరపాక్క తదితర ప్రాంతాల్లోని లైకా కంపెనీకి చెందిన ఎనిమిది చోట్ల దాడులు జరుగుతున్నాయి. దాడుల వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే, అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు …
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ సర్కార్పై ఆరోపణలు చేశారు. బీజేపీ నేత అన్నామలై ఈ అంశంపై పలు మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫమేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ నేత తన డీఎంకే ఫైల్స్ …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …
Read More »ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు
దేశ రాజధాని నగరం ఢిల్లీ నగరంలోని మధుర రోడ్ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు , బాంబు స్వ్కాడ్ పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు …
Read More »దోమలు కుడుతున్నాయని రైలును ఆపించిన బీజేపీ ఎంపీ
యూపీలోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్వీర్ సింగ్ను దోమలు కుట్టడంపై అనుచరుడు మాన్సింగ్ ట్విట్టర్లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్ అధ్వానంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఉన్నావ్ స్టేషన్లో ఆపి బోగీ మొత్తం దగ్గరుండి శుభ్రం చేయించారు. దోమలను వెళ్లగొట్టేందుకు ఫాగింగ్ చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. తమ ఫిర్యాదులపైనా ఇలాగే స్పందించాలని సాధారణ …
Read More »