తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు రోడ్ల అభివృద్ధిలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముందంజ. ఈ సందర్భంగా జీవో నo. 242 లో భాగంగా బోథ్ నియోజకవర్గానికి రూ. 33.48 కోట్లు మంజూరు చేయించిన గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు. వివరాలు చిరకాల వాంఛలుగా …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు
ఈరోజు మంగళవారం బులియన్ మార్కెట్లో వెండి, బంగారు ధరలు తగ్గాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.1,000 తగ్గడంతో రూ.79 వేలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గడంతో రూ.55,150 ఉంది.. . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గడంతో రూ.60,160కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
Read More »పెళ్లి పీటలు ఎక్కిన ప్రముఖ కమెడియన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ మహేశ్ విట్టా తన ప్రియురాలు శ్రావణిని పెళ్లి చేసుకున్నారు.ఏపీలో వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లతోపాటు పలువురు నటులు హాజరయ్యారు. యూట్యూబ్ వీడియోలతో పేరుపొందిన మహేశ్.. బిగ్బాస్-3లో దాదాపు 60 రోజులు ఉన్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. కృష్ణార్జున యుద్ధం, శమంతకమణి, టాక్సీవాలా, ఛలో, కొండపొలం, అల్లుడు అదుర్స్ తదితర చిత్రాల్లో నటించారు.
Read More »వరదలపై మంత్రి తలసాని సమీక్ష
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో భారీ వర్షంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ జలాశయంలో నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి… నగరంలో ఉన్న అన్ని నాలాల దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. …
Read More »మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగుల కుటుంబానికి చెందిన శ్వేతా గ్రానైట్స్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దాదాపు 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను అక్రమంగా చైనాకు తరలించారు.. ఇందులో 74.8 కోట్ల మేర హవాలా మార్గంలో లావాదేవీలు జరిగాయని ప్రాథమికంగా వెల్లడైంది. అటు ప్రభుత్వానికి గౌ50 కోట్ల మేర పెండింగ్ …
Read More »కాంగ్రెస్ లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే..!
తెలంగాణ బీజేపీ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన వారిలో మొదటివాడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. అయితే తాజాగా తెలంగాణ ఉద్యమకారులకు,బహుజనులకు కీలక పదవులు ఇవ్వాలనే సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కూడా …
Read More »కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఉన్న ఐదు వందల అరవై ఏడు మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు,అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బోజ్జా జోవో విడుదల చేశారు. దాదాపు అరవై మూడు మంది …
Read More »అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ
దేశంలోనే అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది. దేశంలో ఉన్న ఎనిమిది జాతీయ పార్టీలు తమ ఆస్తులను తెలియజేశాయి. ఈ క్రమంలో 2021-22ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,829.16కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ సీపీఐ సీపీఎం బీఎస్పీ ఏఐటీసీ ఎన్ పీఈపీ పార్టీలు ఆస్తుల వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. అయితే ఈ ఎనిమిది పార్టీల్లో బీజేపీ ఆస్తులు అక్షరాల రూ.6,046.81కోట్లు.. కాంగ్రెస్ ఆస్తులు …
Read More »శివలింగాన్ని అవమానించిన బీజేపీ మంత్రి
యూపీకి చెందిన మంత్రి సతీశ్ శర్మ శివలింగం వద్ద చేతులు కడగటం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టిస్తుంది. యూపీ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సతీశ్ శర్మ ,మరికొంతమంది మంత్రులు.. బీజేపీకి చెందిన నేతలతో ఇటీవల రామ్ నగర్ తెహసీల్ లోని హెత్మాపూర్ గ్రామంలో లోధేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని గత నెల ఇరవై ఏడో తారీఖున సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ …
Read More »కోవిడ్ టీకాలకు… గుండె పోటుకు సంబంధం ఉందా..? లేదా..?
కరోనా విజృంభణ తర్వాత అత్యధికులు గుండెపోటుతో మృత్యువాత పడుతున్న సంగతి తెల్సిందే. అయితే కోవిడ్ కు గుండెపోటుకు ఏమైన సంబంధం ఉందా..?. లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాము..?. దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న కోవిషీల్డ్ ,కోవ్యాక్సిన్ టీకాలకు గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రికి చెందిన పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. భారత్ లో ఆ టీకాలు చాలా సురక్షితమని వివరించారు. తాము జరిపిన పరిశోధనల్లో భాగంగా …
Read More »