తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
Read More »కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ పార్టీకి మేఘాలయ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. వీరిలో మాజీ సీఎం ముకుల్ సంగ్మా కూడా ఉండటం గమనార్హం. మేఘాలయ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో తాజాగా 12 మంది ఎమ్మెల్యేలు గుడ్బై చెప్పారు. దీంతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
Read More »అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ హావా
పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది. కూచ్బిహార్ జిల్లాలోని దిన్హటా స్థానంలో టీఎంసీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్థానమైన దిన్హటాలో ఈసారి టీఎంసీ తరపున ఉదయన్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్తి అశోక్ మండల్పై .. ఉదయన్ సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో …
Read More »భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం
భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభా సింగ్.. బీజేపీ అభ్యర్థి కుషాల్ ఠాకూర్పై గెలుపొందారు. దాదాపు పది వేల ఓట్ల మెజారిటీతో బ్రిగేడియర్ కుషాల్ ఓటమి పాలయ్యారు. ఇక ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ అసెంబ్లీ స్థానాలను …
Read More »కాంగ్రెస్ పార్టీకి షాకిస్తున్న వలసల పర్వం
కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కాంగ్రెస్ను వీడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. సంగ్మాతో పాటు దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరతారని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసే దిశగా మేఘాలయలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో …
Read More »రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ
వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతుల నిరసనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు పలుకుతూ నరేంద్ర మోదీ సర్కార్ దోపిడీ విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు.రైతులు అహింసా మార్గంలో సత్యాగ్రహం సాగిస్తుంటే ఈ దోపిడీ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఈరోజు భారత్ బంద్ …
Read More »లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా-మంత్రి KTR
కావాలనే కొంత మంది ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశానని తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి …
Read More »పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ
పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారని చరణ్జిత్ సింగ్ తెలిపారు. అటు కొత్త సీఎంకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంగ్రాట్స్ చెప్పారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని సూచించారు.
Read More »పంజాబ్ సీఎం రాజీనామా
పంజాబ్ కాంగ్రె్సలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం పదవి నుంచి అమరీందర్ వైదొలగడం ప్రాధాన్యం సంతరించకుంది. అయితే పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్సింగ్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ …
Read More »మాణిక్యం ఠాగూర్కు మంత్రి కేటీఆర్ చురకలు
ఏఐసీసీ నాయకుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆయనకు చురకలంటించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను పరుష పదజాలంతో విమర్శించిన రేవంత్ రెడ్డి ఆడియో క్లిప్ బయటపడిన నేపథ్యంలో.. దాన్ని ఉద్దేశించి ఠాగూర్ ట్వీట్ చేశారు. ఓ సంభాషణను జర్నలిస్టు రికార్డు చేసి, దాన్ని అధికారంలో ఉన్న వారికి పంపితే, అలాంటి జర్నలిస్టుల గురించి ఏం ఆలోచించాలి? అని ఠాగూర్ ప్రశ్నిస్తూ.. …
Read More »