టీమిండియా మాజీ ఆటగాడు,ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?. ఆయన కన్పించడం లేదంటూ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి.
దేశ రాజధాని మహానగరం ప్రస్తుతం వాయు కాలుష్య సమస్యతో సతమతవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సమస్యపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తోన్నాయి.
ఈ క్రమంలోనే కొంతమంది గంభీర్ కన్పించడం లేదంటూ పోస్టర్లు అతికించి నిరసన తెలిపారు.ఢిల్లీ మొత్తం ఎంపీ గౌతమ్ గంభీర్ అచూకీ కోసం వెతుకుతుందని ఆ పోస్టర్లలో రాసి ఉంది. అయితే ఇది ఆప్ పార్టీకి చెందిన వారి పని అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.