దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు విజయవాడ కృష్ణానది తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కరణ్ రెడ్డి స్వామివారిని కలిసారు. తాజా పరిణామాలపై మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కరణ్ రెడ్డి కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. ఆధ్యాత్మికంగా కరణ్ రెడ్డి మొదటినుంచీ స్వరూపానంద స్వామి కి అనుచరుడిగా ఉంటున్నారు. గతంలోనూ ఎన్నోసార్లు కరణ్ రెడ్డి స్వామివారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలో విజయవాడకు స్వామివారు రావడంతో కరణ్ రెడ్డి వెళ్లి స్వామివారిని కలవడం జరిగింది.
