కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో 2019-20ఏడాదికి చెందిన యూనియన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ”దేశంలో మహిళల
నాయకత్వానికి తమ ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తామని”హామీచ్చారు. అందులో భాగంగా తాజా బడ్జెట్లో స్వయం సహయక సంఘాలకు వరాలు ప్రకటించారు నిర్మలా. వీరికి మద్ధతుగా ముద్రయోజన
వర్తింపజేస్తామని తెలిపారు. ముద్రయోజన కింద డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరికి రూ. లక్ష చొప్పున రుణం మంజూరు చేయిస్తామన్నారు. అయితే జన్ ధన్ ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళకు రూ.5వేల ఓవర్ డ్రాప్ట్
సౌకర్యం కల్పిస్తామని ఆమె అన్నారు.