టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. కేంద్ర మంత్రులు, కోహ్లీ, సింధూ, కీర్తి సురేష్, కాజల్ వంటి సినీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు, ఐఏఏస్, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విసిరిన గ్రీన్ఛాలెంజ్ను స్వీకరించిన ఏపీ మంత్రి అనిల్కుమార్ యాదవ్.. అమరావతిలో ఈ రోజు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి , కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి , హీరో అర్జున్ లను గ్రీన్ ఛాలెంజ్కు నామినేట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత మంత్రి అనిల్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మొక్కలు నాటించే కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకమని, పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా మంత్రి అనిల్కుమార్ తెలియజేశారు. పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కల్ని నాటడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. మొత్తంగా గ్రీన్ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా హరిత ఉద్యమంలా కొనసాగుతోంది..హ్యాట్సాఫ్ టు ఎంపీ సంతోష్కుమార్..!