ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 400లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. దేశం మొత్తం మీద ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించ్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రజలను కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలకు తోడుగా సెలబ్రిటీలు కూడా నిలిచారు. ఇందులో హీరో నితిన్ ముందంజులో ఉన్నారు. తనవంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు 20లక్షలు విరాళం ఇచ్చాడు. అంతేకాకుండా మీ ఆరోగ్యం కాపాడుకోడానికి ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరాడు.