Home / NATIONAL / దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 39 వేల కేసులు నమోదవగా, తాజాగా మరో ఏడు వందల కేసులు అదనంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది.

ఇందులో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 4,20,551 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 3,05,43,138 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 39,972 మంది కోలుకోగా, కొత్తగా 535 మంది మృతిచెందారని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 43,31,50,864 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat