తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం పోసానితోపాటు ఆయన కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పోసాని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో ఆస్పత్రిలో చేరడం వల్ల తాను నటించాల్సిన సినిమాలకు అంతరాయం ఏర్పడుతుండటంతో దర్శకనిర్మాతలకు క్షమాపణలు చెప్పారు.ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలతోపాటు పలు సినిమాల్లో నటించాల్సి ఉంది.
షూటింగ్ కు రాకపోవడం వల్ల దర్శకనిర్మాతలు, కో యాక్టర్లకు అసౌకర్యం కలుగుతున్నందుకు చింతిస్తున్నా. దేవుడి దయ, ప్రజల ప్రేమాభిమానాలతో తాను త్వరగా కోవిడ్ నుంచి రికవరీ అయ్యి తిరిగి షూటింగ్ లో జాయిన్ అవుతానని పోసాని కృష్ణమురళి ఆశాభావం వ్యక్తం చేశారు. పోసాని కుటుంబసభ్యులతోపాటు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆయన ఫాలోవర్లు కోరుకుంటున్నారు.