దేశంలో రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది మరణించారు. మరో 1,18,443 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 12,510 మంది కరోనా నుంచి కోలుకోగా, 249 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 5080 కేసులు ఉన్నాయి. మరో 40 మంది మృతిచెందారు.