తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో మొక్కలు నాటారు ప్రముఖ సినీ నటి మాధవి లత..
ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద మొక్కలు నాటాలని కోరారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు చాలా అవసరం అని చెట్లను కట్ చేయకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి గ్రీనరి పెంచాలని కోరారు.ఈ సందర్భంగా తన స్నేహితులకు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని మాధవి లత చాలెంజ్ విసిరారు….