ఇప్పటికే కరోనా మూడు వేవ్ లతో అతలాకుతలం అయిన ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు కొత్త వైరస్ పుట్టుకోస్తుంది చైనా నుండి. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా దేశంలో తాజాగా ఆ దేశ ప్రజలను స్టెల్త్ ఒమిక్రాన్ అనే వైరస్ వణికిస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి నిన్న మంగళవారం అత్యధికంగా 5280 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ముందు రోజు కంటే తర్వాత రోజు కేసులు రెట్టింపయ్యాయి. అయితే కొత్త కేసు ఒక్కటి కూడా రాకుండా చూసే వ్యూహంలో భాగంగా రెండేళ్లకు పైగా కొవిడ్ ను కట్టడి చేస్తూ వస్తున్న ఈ దేశాన్ని ఈ కొత్త వేరయంట్ గజగజలాడిస్తుంది.
వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో రెండేళ్ల కిందట అంటే 2020 ఫిబ్రవరి పన్నెండున అత్యధికంగా దాదాపు పదిహేను వేల కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఈ రోజు ఐదు వేల తొంబై కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కొత్త వేరియంట్ కేసులు ఇంతమొత్తంలో నమోదవ్వడంతో చైనా పదమూడు నగరాలను మూసివేసింది.దీంతో మూడు కోట్లకు పైగా ప్రజలను లాక్ డౌన్ లో ఉంచింది.