ఎప్పుడు ఏదోక వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియా సమావేశం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఇది నిజంగా బిగ్ షాకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీకి చెందిన యువమంత్రి కేటీఆర్ గురించి దుర్భాషలాడిన కేసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్లెక్సీలు,హోర్డింగులను చింపేయడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ కు చెందిన్ అప్పటి కార్యదర్శి ప్రస్తుత ఎమ్మెల్సీ,ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ 2020నవంబర్ 23న పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణ సోమవారం ప్రారంభమైంది. 313ఎగ్జామినేషన్ కు ఎంపీ ధర్మపురి అర్వింద్ హజరు కాకపోవడంతో నాంపల్లిలోని ఎంపీ,ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ అర్వింద్ ను అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించింది.