Home / ANDHRAPRADESH / అదీ జగన్‌ ఫేస్‌ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా

అదీ జగన్‌ ఫేస్‌ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా

టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమైనా చర్చించారా అని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్‌ను విమర్శించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, టీడీపీకి చంద్రబాబు శని అని.. ఈ మాటలను స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా అన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ ప్రాణాలు తీసి.. ఇప్పుడు ఆయన ఫొటోకి దండలు వేసి దణ్ణం పెడుతున్నారని రోజా ఆరోపించారు.  జగన్‌ ప్రభుత్వం ఎన్టీఆర్‌ జిల్లా అని పేరు పెడితే కనీసం చంద్రబాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదని విమర్శించారు.

పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ జగన్‌ లబ్ధి చేకూరుస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇప్పటికే అమలు చేశామని.. అదీ నాయకుడి లక్షణమని చెప్పారు. జగన్‌ ఫొటోతో బస్సు యాత్ర చేస్తున్న మంత్రులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. జగన్‌కు ఉన్న ఫేస్‌ వేల్యూ అలాంటిదన్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat