కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాజులరామారం దోబిఘాట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని రజకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దోబిఘాట్ లో షెడ్డు ఏర్పాటు, స్టోర్ రూం, టాయిలెట్స్, రోడ్డు నిర్మాణం, కాంపౌండ్ వాల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పొందుపర్చారు.
చిత్తారమ్మ ఆలయం వెనకాల రాచకొండ స్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రజకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయా పనులు త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వాషింగ్ మెషీన్స్, లోన్లు అందేలా సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గారు రజకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్.రాజు, ఆర్.స్వామి, ఆర్.శ్రీనివాస్, ఆర్.రవి, ఆర్.వేణు గోపాల్, ఆర్.సత్యనారాయణ, ఆర్.శంకరయ్య, ఆర్.రవి, శ్రీకాంత్, ఆర్.నాగరాజ్, అశోక్, కుమార్, నర్సింహా, నాగేష్, బాలరాజ్, జ్ఞానేశ్వర్, గోపాల్, సత్యాయ్య, మోగులుయ్య తదితరులు పాల్గొన్నారు.