రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలయింది. సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగనున్నది.ఈ ఎన్నికల్లో భాగంగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీలుచైరులో వచ్చి మరి పార్లమెంట్ లో తన ఓటేశారు.
అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయన ఓటేశారు. వ్యక్తిగత సిబ్బంది సహకారం తీసుకుని ఎంపీ మన్మోహన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.