Home / SLIDER / మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం -ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం -ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వచ్చేనెల నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్‌  అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎల్.బి.నగర్  శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రత్న నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలకు ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో ఇవాళ చౌట్‌ప్పల్‌లో  పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశమై పార్టీ అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు వివరించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధిస్తే మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలను చైతన్య పరచాలని కోరారు .

కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ  టీఆర్ఎస్  నాయకులు నర్సిరెడ్డి, దామోదర్ రెడ్డి, మల్లేశం, కిరణ్, శశిధర్ రెడ్డి, అమర్, రాంరెడ్డి,  ఎల్.బి.నగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఓరుగంటి వెంకటేశ్‌, మాన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, ఎల్.బి.నగర్ నియోజకవర్గ పలు డివిజన్ల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, సత్యంచారి, లింగాల రాహుల్ గౌడ్ ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat