Home / SLIDER / క్రీడల అభివృద్ధికి తోడ్పాటునందిస్తా- ఎమ్మెల్సీ కవిత

క్రీడల అభివృద్ధికి తోడ్పాటునందిస్తా- ఎమ్మెల్సీ కవిత

 తెలంగాణ రాష్ట్రంలోని  నిజామాబాద్‌ జిల్లాలో క్రీడల అభివృద్ధికి, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యక్రమాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఒలింపిక్స్‌ సంఘం నూతన కార్యవర్గం ప్రతినిధులు ఈ రోజు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.

సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్‌, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, కోశాధికారి జివి భూమారెడ్డి తదితరులు ఎమ్మెల్సీకి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలియజేస్తూ జిల్లాలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించే విధంగా జిల్లా ఒలింపిక్‌ సంఘం కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంఘం సభ్యుడు యాసిన్, రాష్ట్ర సెపక్ తక్రా అధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాధారి సంజీవ్ రెడ్డి, జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ కుమార్, హైదరాబాద్‌ అర్చరీ ప్రధాన కార్యదర్శి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat