ఖానాపూర్ పట్టణంలోని కొమరం భీం చౌరస్తా వద్ద అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు స్థలం కేటాయించిన సందర్భంగా నేడు ఖానాపూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘ & దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారిని కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలిపారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమ ద్వేయమని, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారితో మాట్లాడి భవన నిర్మాణానికి 50 లక్షలు శాంక్షన్ చేపిస్తా అని రానున్న అంబేద్కర్ జయంతిని అక్కడే ఘనంగా జరుపుకుందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ఖానాపూర్ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు టిఆర్ఎస్ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు