కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గౌరవ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 9 గంటలకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ గారి బొమ్మ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి టౌన్, రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు.
సత్తుపల్లి టౌన్ లోని ప్రతి వార్డు నుండి మండలంలోని ప్రతి గ్రామం నుండి ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని, మహిళలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొని నిరసన తెలపాలని నాయకత్వం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డీసీసీబీ డైరక్టర్ చల్లగుల్ల క్రిష్ణయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, జెడ్పీటీసీ కూసంపూడి రామరావు, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డ శంకరరావు, సత్తుపల్లి టౌన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, మండల ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు తుంబురు కృష్ణరెడ్డీ, వార్డు కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్, గుండ్ర రఘు, మారుతి సూరిబాబు, షేక్ నాగుల్ మీరా, నాయకులు మోరంపుడి ప్రసాద్, అమరవరపు కృష్ణారావు, మరికంటి శ్రీను, మిద్దె శ్రీను, అబ్దుల్లా, వేములపల్లి మధు, మేకల నరసింహారావు, సత్తుపల్లి రూరల్ మండలం జోనల్ అధ్యక్షులు చింతల సురేందర్ రెడ్డి, గాయం రాంబాబు, కొడిమెళ్ళ అప్పారావు, మోదుగు పుల్లారావు, కొప్పుల అప్పారావు తదితర నాయకులున్నారు.