ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది.
దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.