గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 16 వ డివిజన్ పరిధిలోని ధర్మారం లో గల ప్రైమరీ స్కూల్ లో రెండోవ విడత కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన కార్పొరేటర్ సుంకరి మనిషా శివ కుమార్ ….ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచం లోనే ఎక్కడా లేదన్నారు..బాధితులకు అక్కడికక్కడే కళ్ళ జోడు ను అందిచడమే కాకుండా అవసరమయ్యే వారికి అపరేషన్ లకు కూడా రికమండ్ చేసి, వాటిని కూడా సంబంధిత ఆసుపత్రి లలో చేయిస్తామని వారు తెలిపారు.
అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమం గొప్ప కార్యక్రమని,చాలా మంది తమకు చూపు తక్కువ అయిందని తెలిసి కూడా , ఆసుపత్రి కి వెళ్ళడానికి సమయం,స్తోమత లేక కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి కోసమే కేసీఆర్ గారు నేరుగా గ్రామాల్లోకి వెళ్లి శిబిరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య,ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ S మాధవీలత,కంటి వెలుగు క్యాంప్ వైద్యాధికారి డాక్టర్ G.పల్లవి,CHO మధుసూధన్ రెడ్డి,కంటి వైదుడు గణేష్,GWMC AEకృష్ణమూర్తి, భారాస గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నాసం.మల్లేశం,ఉపాధ్యక్షుడు సంకతాల.రాజు, భారాస నాయకులు పిట్టల రాజు, కొమ్ముల.కిషోర్ కుమార్, బొల్లం.రాజయ్య,యుగెందర్,కొమ్ముల.రవీందర్,గాదె.సుదర్శన్, గొదాసి.రమేష్,రాజు,గంగుల.నాగరాజు,వల్లెం.శ్రీనివాస్,దుపాకి.నరేందర్,కొమ్ముల.చిరంజీవి,దుపాకి.అశోక్,కర్ణాకర్ మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది,ఆశా వర్కర్లు,మహిళ సంఘాల RP లు,జవాన్ విష్ణు,మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక BRS నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..