ఏపీలో నిన్న శుక్రవారం ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏడు.. ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ ఒక స్థానంలో గెలుపొందిన సంగతి తెలిసిందే.
అయితే అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేశారనే ఆరోపణలతో ఆ పార్టీ నుంచి సస్పెన్సన్ కు గురైన తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అజ్ఞాతంలో వెళ్లిపోయారు.
సస్పెన్షన్ తర్వాత ఎలాంటి స్పందన తెలియజేయని ఆమె.. ఎక్కడికెళ్లారనేది తెలియడం లేదు. హైదరాబాద్ కు వెళ్లి ఉండొచ్చని అనుచరులు చెబుతున్నారు. కాగా, నిన్న వైసీపీ కార్యకర్తలు ఆమె కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను చించేసి శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.