తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యి, పదో ఏడు ప్రారంభం కానున్న నేపథ్యంలో 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగనున్నాయి.