బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 8 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను మంగళవారం ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య-వెంకటేష్,తహశీల్దార్ వినోద్,ఎంపీడీఓ సంతోష్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ చేతుల మీదుగా బాల్కొండ,కిసాన్ నగర్,వన్నెల్ (బి),చిట్టాపూర్,బోదెపల్లి, జలాల్పూర్,నాగపూర్,ఇత్వార్ పేట్ గ్రామాలకు చెందిన 36 కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ పథకాన్నీ ప్రవేశ పెట్టారని ఒక్కొక్క లబ్దిదారులకు రూ1 లక్ష ఒక వంద పదహారు రూపాయలు చొప్పున అందజేయడం జరిగిందని వారు తెలిపారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.పేద కుటుంబాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తోబుట్టువుగా ఉన్నారని ప్రతీ ఒక్క ఆడపడుచుకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.లబ్ధిదారులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈకార్యక్రమంలో సర్పంచ్లు నోముల రవి,మానేటి తులసి నాగభూషణం,చాట్లపల్లి వనజ గోవర్ధన్ గౌడ్,గడ్చంద కల్పన అనీల్,సంతకుల సాయమ్మ జువ్వన్న,ఎంపీటీసీ సభ్యులు EP నారాయణ,అనుగుల రాంరాజ్ గౌడ్,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,ఉప సర్పంచ్లు షేక్ వాహబ్,కోట మురళీ,మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్,గ్రామశాఖ అధ్యక్షులు నోముల మోహన్,ఎనుగందుల శ్రీనివాస్,తెరాస నాయకులు దూధాటి సూర్యప్రకాష్,తోపారం గంగాధర్,షేక్ ఆరిఫ్,నార్ల రాజు,సీనియర్ అసిస్టెంట్ రమేష్,RI రాఘవేందర్,రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.