Home / SLIDER / రిమ్స్ లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స

రిమ్స్ లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స

తెలంగాణ లో ఆదిలాబాద్ లోని రిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఓ బాలికకు ఉపశమనం కల్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రా నికి చెందిన ఓ బాలిక (16) కొన్నేండ్లుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతు న్నది. కుటుంబ సభ్యులు బాలికను వివిధ ప్రైవేటు దవాఖానల్లో చూపించినా ఎక్కడా సరైన వైద్యం అందలేదు. కడుపు నొప్పి పెరుగుతూ వచ్చింది. గురువారం రిమ్స్క తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన

వైద్యులు ఆమె కడుపులో గడ్డలాగా ఉన్నట్టు గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం ఆపరేషన్ పూర్తి చేశారు. బాలిక కడుపులోంచి దాదాపు కిలోన్నర వెంట్రుకలను తొలగించారు. ప్రస్తుతం ఆ బాలిక క్షేమంగా ఉన్నది. మానసిక సమస్యతో బాధపడుతున్న వారిలో ట్రైకో బెజోఅర్స్ వ్యాధి కారణంగా ఆ బాలిక వెంట్రుకలను తిని ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యు లను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అభి నందించారు

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat