తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గురువారం మధ్యాహం పెనుబల్లి మండలంలోని సూరయ్య బంజర్, కొత్త కారాయిగూడెం, కుప్పెనకుంట్ల, పాత కుప్పెనకుంట్ల, తదితర గ్రామాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారితో తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభించారు.కొత్త సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేశారు.అనంతరం కుప్పెనకుంట్ల లో ఆళ్ల వెంకటేశ్వరరావు – లక్ష్మీ దంపతుల కుమారుడు ఆళ్ల నవీన్ – ఆలేఖ్య వివాహం జరిగింది. ఈ సందర్భంగా వారి ఇంటికెళ్లి ఎంపీ నామ , సండ్ర నూతన వధూవరులకు అక్షింతలు వేసి, ఆశీర్వదించారు.కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
