ఏపీ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీట్లు ఇవ్వరని స్పష్టం చేశారు.
తాము సీట్లు ఇవ్వని వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో టచ్లో ఉంటే తమకేమీ నష్టం లేదని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
అలాగే సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యకు కౌంటరిచ్చారు. బాలయ్య వీరతిలకం దిద్ది పంపిన ఇద్దరు అల్లుళ్లను గత ఎన్నికల్లో ఇంటికి పంపినట్లే.. ఈ సారి బావ, బావమరుదులను ముఖ్యమంత్రి జగన్ ఇంటికి పంపుతారన్నారు.