తెలంగాణ రాష్ట్రంలో పది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4 లక్షల 86వేల 194 మంది దరఖాస్తు చేసుకోగా.. 4 లక్షల 84 వేల 384 మంది పరీక్షలు రాశారు. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను వివిధ అధికారిక వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
