దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న గురువారం ఒక్కరోజే 2628 కేసులు నమోదయ్యాయి. కానీ నేడు శుక్రవారం 2710 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి. ఇందులో 4,26,07,177 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా, 5,24,539 మంది మరణించారు. మరో 15,814 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 14 మంది మృతిచెందగా, 2296 మంది …
Read More »మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు బీజేపీ షాక్
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప …
Read More »దేశంలో మరోసారి కరోనా విజృంభణ
దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. నిన్న మంగళవారం 1,675 మందికి పాజిటివ్ అని తేలింది. తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి. ఇందులో 4,26,02,714 మంది కోలుకోగా, 14,971 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 5,24,507 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1977 మంది కరోనా నుంచి బయటపడగా, 17 మంది మరణించారని కేంద్ర …
Read More »ఘోరం.. బిల్డింగ్ కింద సుమారు 200 డెడ్బాడీలు..
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లోని చాలా పట్టణాలు, నగరాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పోర్ట్ సిటీ మేరియుపోల్ తీవ్రంగా నష్టపోయింది. మూడునెలలుగా రష్యా జరుపుతున్న దాడిలో వందలాది మంది చనిపోయారు. ఆ నగరంలో తాజాగా భయానక వాతావరణం నెలకొంది. కూలిపోయిన ఓ భవనం కింద సుమారు 200 డెడ్బాడీలు లభ్యమయ్యాయి. భవనం శిథిలాలను కార్మికులు తొలగిస్తుండగా మృతదేహాలను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. డెడ్బాడీలు కుళ్లిపోయిన స్థితిలో …
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 1,675 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,675 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరింది. తాజాగా 1,635 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 4,26,00,737 మంది బాధితులు కోలుకున్నారు. మరో 31 మంది వైరస్ బారినపడి మృతి చెందగా.. మొత్తం 5,24,490 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు.
Read More »మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం!
ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి చేరాయి. ఇప్పడు కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర అప్పు చేసే యోచనలో ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ లక్ష కోట్ల అప్పు కోసం మార్కెట్కు వెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. …
Read More »కేంద్రంలో హిట్లర్ కంటే దారుణంగా బీజేపీ పాలన: మమత
కేంద్రంలోని బీజేపీ పాలన హిట్లర్, ముస్సోలిని కంటే దారుణంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలోని పాలనా వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం తలదూరుస్తోందని ఆరోపించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థలను కూల్చివేస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలు పనిచేసేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె కోరారు.
Read More »దళిత వ్యక్తి నమిలిన ఆహారాన్ని తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!
కులవివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వింత ప్రయత్నం చేశారు. దళిత పూజారి స్వామి నారాయణ్ నమిలిన ఆహారాన్ని ఆయన తిని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజపేటలో చోటుచేసుకుంది. అక్కడ నిర్వహించిన అంబేడ్కర్ జయంతి, ఈద్ మిలాన్ ఉత్సవాల్లో స్వామి నారాయణ్కు ఎమ్మెల్యే జమీర్ఖాన్ తన చేతితో ఆహారం తినిపించారు. ఆ తర్వాత స్వామి నారాయణ్ ఎమ్మెల్యేకు ఆహారం తినిపించబోతే …
Read More »కరోనా ఉదృత్తి -భారత్ కు సౌదీ అరేబియా షాక్
గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారతదేశానికి ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది. మొత్తం 16 దేశాలను ఈ జాబితాలో చేర్చింది. కరోనా మహమ్మారి ఇంకా నశించలేదని, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలకు WHO హెచ్చరించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. భారత్లో గత 24 గంటల్లో 2,226 కరోనా కేసులు నమోదవగా మొత్తం 14,955 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Read More »అబ్బాయికి బట్టతల ఉందని అమ్మాయి….?
సహజంగా పెళ్లి కొడుకు నచ్చలేదనో.. కట్నం తక్కువైందనో.. లేదా అబ్బాయి అందంగా లేడని పెళ్లి చూపులప్పుడే ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఓ వధువు తాను చేసుకునే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు …
Read More »