ఇకపై తమ కంపెనీ డీజిల్ కార్లను అమ్మబోదని మారుతి సుజుకి ఇండియా కార్ల కంపేనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2020 నుంచి భారత్ లో డీజిల్ కార్ల అమ్మడం ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రజల నుంచి డిమాండ్ భారీగా పడిపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్మన్ ఆర్ సి భార్గవ ఓ ప్రకటనలో తెలిపారు.