టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్రావు ఫిర్యాదు మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్, ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రవిప్రకాశ్, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు… ఇవాళ ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్వో ఎంవీకేఎన్ మూర్తి శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయానికి వచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్క్లు, నాలుగు ల్యాప్టాప్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
