హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈ రోజు వరంగల్ నగరం, మడికొండలో కొలువై ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని విశాఖ శ్రీ శా రదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని శ్రీ మెట్టు రామలింగేశ్వరుడికి స్వామివారు పంచామృతాలతో అభిషేకం చేసి, పూజలు చేశారు. అలాగే ఆలయంలోని శ్రీ సీతా రాముల స్వామివారికి, గుట్ట పైన నిర్మాణంలో ఉన్న సరస్వతి గుడిలో స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ భక్తులకు హిందు ధర్మశాస్రం యొక్క గొప్పతనాన్ని స్వామివారు ప్రవచించారు. ఆలయంలోనే పాద పూజ కార్యక్రమాలు నిర్వహించి దంపతులను దీవించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అభిలాష్ శర్మ, విష్ణు, సత్యనారాయణ, ఆలయ ఈ.ఓ వీర స్వామి , తెరాస సీనియర్ నాయకులు అవాల రాధిక రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆలయ ఛైర్మన్ అల్లం శ్రీనివాస్, స్థానిక 33 వ డివిజన్ కార్పొరేటర్ తొట్ల రాజు మరియు స్వామి వారి ప్రచార సమన్వయ కర్తలు రాంమూర్తి పోలపల్లి, గాడిచర్ల శ్రీకాంత్ రెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు.
