Home / NATIONAL / దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. ఇందులో 3,04,29,339 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,18,987 మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం దేశంలో 4,09,394 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 41,78,51,151 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీల కేసులు 1.31శాతం ఉన్నాయి.

వీక్లీ పాజిటివిటీ రేటు 2.12శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.41శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 45.09 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు పేర్కొంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat