దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది.
ఇందులో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,42,655 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారని, కొత్తగా 338 మంది మృతిచెందారని తెలిపింది.ఇక ఇప్పటివరకు 73,82,07,378 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇందులో ఒకేరోజు 72,86,883 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది. దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో కేరళలో 20,487 కేసులు ఉన్నాయని, 181 మంది మరణించారని తెలిపింది.