దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,970 మంది కోలుకున్నారు. 1,399 మంది మరణించారు. ప్రస్తుతం 15,636 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,23,622కు చేరింది. ఢిల్లీతోపాటు 12 రాష్ట్రాల్లో కేసులు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 192.85 కోట్ల టీకాలను పంపిణీ చేశారు.
