తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధినేత శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో సమావేశమయ్యారు.
ఢిల్లీ లోని సీఎం కేసీఆర్ గారి అధికారిక నివాసంలో వారి భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు.
సీఎం కేసీఆర్ గారి వెంట టి.ఆర్.ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు గారు, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు , ఎంపీలు సంతోష్ గారు, రంజిత్ రెడ్డి గారు, వెంకటేష్ నేత గారు తదితరులు వున్నారు