తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ బంగారం విలువ రూ. 53.77 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. క్నీ క్యాప్స్లో బంగారాన్ని దాచి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.