Home / ANDHRAPRADESH / మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్‌

మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్‌ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు.

మహేష్‌కి 2019లో యాక్సిడెంట్‌ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని.. తనను ఆదుకోవాలని అర్జీలో మహేష్‌ కోరాడు. సీఎం మంచి మనసుతో తన అర్జీని తీసుకునేందుకు సెక్యూరిటీ స్టాఫ్‌ను పంపడంపై యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తరఫున ఏదో ఒక సాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat