కోలీవుడ్ స్టార్ హీరో.. ప్రముఖ సినీ హీరో విశాల్ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నట్లు.. ఇప్పటికే అధికార వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే.
తనపై వస్తోన్న వార్తలపై హీరో విశాల్ సంచలన ప్రకటన చేశారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశాడు. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరాడు. అసలు పోటీ విషయమే తనకు తెలియదని, ఎవరూ తనని సంప్రదించలేదని ట్విటర్ వేదికగా టించాడు.