మహిళా దినోత్సవం నేపథ్యంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ తో కలిసి ప్రగతిభవన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ను రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆవిష్కరించారు.
ప్రకృతి పరిరక్షణ కోసం మహిళలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సృష్టికి మూలం మహిళ అని, స్త్రీ శక్తి స్వరూపులని, వారు తలపెట్టిన కార్యక్ర మాలు పూర్తి చేస్తారని మంత్రి అన్నారు.
8వ తేదిన మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ, విద్యార్థిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలను నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.