తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం కొత్తపల్లి గ్రామంలోని పద్మనాభ స్వామి వారికి జరిగిన బండ్ల ఊరేగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి స్థానిక సర్పంచ్ జగన్, పాపన్నపేట్ మండల పార్టీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారిని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారితో స్థానిక సర్పంచ్ జగన్, పాపన్నపేట్ మండల పార్టీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి, ఆరెపల్లి సర్పంచ్ శ్రీనాథ్, ఏడుపాయల దేవస్థాన కమిటీ డైరెక్టర్ లు మోహన్ రావు, మనోహర్, మాజీ సర్పంచ్ సందీప్, పార్టీ నాయకులు కుర్తివాడ సంజీవ రెడ్డి, సంతోష్, దరూన్ కుమార్, ఉప సర్పంచ్ అజయ్, హావేలి ఘనపూర్ మండల సర్పంచులు మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్, పార్టీ నాయకులు గోపాల్ రావు, జైపాల్ రెడ్డి,మద్దెల భాస్కర్ తదితరులు ఉన్నారు.