ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి నిన్న శుక్రవారం వెళ్లిన సంగతి తెల్సిందే. అయితే నిన్నటి నుండి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై చర్చకు పట్టుబడింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ.
వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందిగా మారిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. సభ ప్రారంభం నుంచి టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. స్పీకర్ వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చివరికి సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.