గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామానికి చెందిన రాముల రవి గారు ప్రమాదవశాత్తు మరణించారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులైన రాముల రేణుక గారికి అందజేశారు.
ఈ సందర్బంగా క్రియాశీల సభ్యత్వం ద్వారా 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందచేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన పేరాల విశ్వనాథ్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 20వేల రూపాయల విలువగల చెక్కును ఎమ్మెల్యే గారు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.