కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని గణేష్ సొసైటీ, గంపల బస్తీల్లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 62వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ ప్రాంతం అభివృద్ధికి నిధుల కొరత లేకుండా మెరుగైన వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మిగిలిన పనులు తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. వాటి వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొబ్బ రంగారావు, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రావు, అడప శేషు, ఇస్మాయిల్, పద్మజ రెడ్డి, పందిరి యాదగిరి, పద్మలత రెడ్డి, శ్రీనివాస్ రాజు, దుర్గారావు, భద్రయ్య, వెంకట్ రెడ్డి, బస్వరాజు, నవాజ్, రషీద్, నదిం, అడప శేషు, సురేష్, లక్ష్మీ మరియు కాలనీల ప్రజలు పాల్గొన్నారు.