Home / SLIDER / దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ

దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని సరోజినీ గార్డెన్స్ లో సీనియర్ నాయకుడు కుంట సిద్ధిరాములు గారి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు.

అభివృద్ధిని సంక్షేమాన్ని సమ పాళ్లలో ప్రజలకు అందిస్తున్న సమర్థవంతమైన పరిపాలన గౌరవ సీఎం కేసీఆర్ గారిది అని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు వచ్చే విపక్ష నేతలకు సరైన బుద్ధి చెప్పే విధంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేళ్ళలో రూ.6 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

విపక్షాల తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో గులాబీ జెండా మూడవ సారి ఎగిరేలా బీఆర్ఎస్ శ్రేణులు సమిష్టి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, గుమ్మడి మధుసుధన్ రాజు, జ్ఞానేశ్వర్, పెద్ది మల్లేశం, మురళి, సమ్మయ్య, కాలే నాగేష్, జైపాల్, అరుణ రెడ్డి, యేసు, బీరప్ప, గోవర్ధన్ రెడ్డి, మాధవ రెడ్డి, కృష్ణ ముదిరాజ్, విజయ్ కృష్ణ, గౌతం, నదీమ్ రాయ్, బాలమల్లేష్, శ్రీకాంత్, కాలే గణేష్, వేణు, అనిల్, భూపాల్ రెడ్డి, నాగేష్ రెడ్డి, భిక్షపతి, ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి, విజయ్ హరీష్, దుర్గా ప్రసాద్, రాజు యాదవ్, శివ ముదిరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat