తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం కోదాడ పట్టణంలోని వేమూరు సుధాకర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రం లో ఇరిగేషన్ రంగంలో వాస్తవంగా తెలంగాణ రాక పూర్వం ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనందరి కూడా తెలుసు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా సాగునీరు లేక కరెంటు లేక వ్యవసాయం చేసే పరిస్థితి లేక అనేక మందికి భూములు జాగాలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో నీళ్లు, కరెంట్ లేక వలసలు పోయిన పరిస్థితి, ఈ భూమి జాగలకు నమ్ముకుంటే బతుకడం కష్టం అని, ఇతర రాష్ట్రాల కు దేశాలకు బతుకు తెరువు కోసం పోదామని, ఒక్కొక్కరు ఊరు నుండి వందల కుటుంబాలు వలసలు పోయిన పరిస్థితిలో బలవంతంగా వ్యవసాయం చేసి పంట చేతికి రాక రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాటువంటి పరిస్థితి నుండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకా, ఈ రోజు ఏ గ్రామానికి వెల్లి చూసిన చెరువులు నిండు కుండల నీళ్లు ఉండడం అనేది అద్భుతంగా చెప్పుకోవచ్చు, అందుకే ఒక పని జరిగిందంటే దానికదే జరుగదు, ఆకాశం నుండి ఊడిపడదు, ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గా ఉంటేనే ఇలా జరుగుతుందని మంత్రి అన్నారు.65 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలనటువంటి నాయకులు, ఏనాడు కూడా సాగునీరు రంగంలో ఒక మంచి ప్రయత్నం చేసి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నీటి వనరులను రైతులకు అందించాలని గాని, ఇక్కడ ఉన్నటువంటి ఎడారి భూములకు సాగునీరు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఏనాడు ఆలోచించలేదు.
మాటలు చెప్పిండ్రు తప్ప, పని జరగలేదు, కాని మన కెసిఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రంగంలో అనేక అద్భుతాలు జరుగుతాయని ఆయన తెలిపారు. మోతె మండలం, మునగాల మండలం, నడిగూడెం కావచ్చు, ఈ ప్రాంతం అంత నీళ్ల గురించి చాలా ఇబ్బంది పడ్డారు.సీఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తి చేసి, తెలంగాణ కి చివరి నియోజకవర్గ మైన కోదాడ కు నీళ్లు అందిచమని తెలిపారు. మొత్తం భూమిని సాగులోకి తీసుకురా గలిగినం, ఇది మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఘనతే అని ఆయన అన్నారు.అనంతరం సాగునీరు రంగంలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఎమ్మెల్యే శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు